PNB భారీ స్కామ్ కేసులో కీలక నిందితుడైన మేహుల్ చోక్సీని భారత్కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్ చేయగా.. అతని ఎగ్జిట్రడిషన్ను కోరుతూ భారత అధికారులు త్వరలో బెల్జియం వెళ్లనున్నారు. ఇప్పటికే బెల్జియం ప్రభుత్వానికి అధికారిక ప్రతిపాదన పంపిన భారత్, అతనికి అక్కడ శరణు లేకపోవడం వల్ల ఎగ్జిట్రడిషన్కు అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని భావిస్తోంది.