రూపాయికే బిర్యానీ అనడంతో ఎగబడిన జనం (వీడియో)

56చూసినవారు
రూపాయికే బిర్యానీ అనడంతో ప్రజలు ఎగబడ్డారు. ఈ ఘటన ఇవాళ ఏపీలోని తాడేపల్లిగూడెం పట్టణంలో చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ రెస్టారెంట్ పాత రూపాయి నోటుకు బిర్యానీ అంటూ ఆఫర్ ప్రకటించి ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ ఆఫర్ ఇవాళ మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యే పెట్టారు. దీంతో హోటల్ వద్దకు పాత రూపాయి నోటుతో పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు. క్యూ రోడ్డు పైకి రావడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది ఏర్పడింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్