దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోంది: టీపీసీసీ చీఫ్

79చూసినవారు
దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోంది: టీపీసీసీ చీఫ్
TG: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ విమర్శించారు. గురువారం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. బీహార్‌లో ఎన్నికల దృష్ట్యా కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించాలని యత్నిస్తోందన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ సభలతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. రాహుల్ గాంధీని అప్రతిష్ఠపాలు చేసేందుకు దర్యాప్తు సంస్థలను బీజేపీ వాడుకుంటోందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్