బీహార్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీ నేత గోపాల్ ఖేమ్కా శుక్రవారం రాత్రి పాట్నాలో దారుణ హత్యకు గురయ్యారు. ఖేమ్కా ఇంటి బయట దుండగులు ఆయనను గన్తో కాల్చి హత్యచేశారు. గాంధీ మైదాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పనాచే హోటల్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒక బుల్లెట్, కేసింగ్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. హంతకులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.