ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

76చూసినవారు
ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆప్ అధినేత కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ముందు ఈసీ లొంగిపోయిందని.. ఇది చూస్తుంటే అది తన స్వతంత్ర ఉనికిని పూర్తిగా కోల్పోయినట్లు తెలుస్తోందని ఆరోపించారు. ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు రిటైర్మెంట్ తర్వాత గవర్నర్ పదవో లేదా రాష్ట్రపతి పదవో బీజేపీ ఆఫర్ చేసినట్లుందని తీవ్ర ఆరోపణలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్