ఉత్తర ప్రదేశ్లోని మిల్కీపుర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి చంద్రభాను పాసవాన్ విజయం సాధించారు.
సమీప సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అజిత్ ప్రసాద్పై 61వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఎస్పీ నేత అవధేశ్ ప్రసాద్ లోక్సభ ఎంపీగా ఎన్నిక కావడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.