ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. దేశంలో 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల వల్లే బీజేపీకి ప్రజలు విజయాన్ని అందించారని అన్నారు. ఈ విజయంలో జేపీ నడ్డా, అమిత్ షా కృషి ఎంతో ఉందన్నారు. ఈ క్రమంలో వారికి కృతజ్ఞతలు తెలిపారు.