నాగర్కర్నూల్ జిల్లా కోడేరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి రోడ్డుపక్కనున్న లోయలో పడిపోయింది. దీంతో అందులో ఉన్న 25 మంది గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. పది మందికి తీవ్రంగా గాయాలు కాగా.. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.