చెన్నై క్రికెట్ స్టేడియానికి బాంబు బెదిరింపు (వీడియో)

79చూసినవారు
భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై క్రికెట్ స్టేడియంకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. నగరానికి చెందిన ఎం.ఏ. చిదంబరం స్టేడియాన్ని బాంబులు పెట్టి పేల్చివేస్తామని బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. స్టేడియంను ఖాళీ చేయించి, బాంబు నిర్వీర్య బృందాలతో తనిఖీలు చేపట్టారు. అనంతరం భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు ఈ-మెయిల్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్