నవీ ముంబైలో 2020లో చోటుచేసుకున్న పోక్సో కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 15 ఏళ్ల బాలిక యూపీకి చెందిన 22 సంవత్సరాల యువకుడితో కలిసి ఇంటినుండి పారిపోయి, 10 నెలల తరువాత గర్భంతో తిరిగి వచ్చిన ఘటనపై బాలిక తండ్రి పోక్సో కేసు పెట్టారు. విచారణలో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి, "బాలిక ఇష్ట ప్రకారమే వెళ్ళింది, ఆమెకు ఏం జరుగుతుందో తెలుసు" అని పేర్కొంటూ, యువకుడికి బెయిల్ మంజూరు చేశారు.