BREAKING: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

80చూసినవారు
BREAKING: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు
భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధం వాతావరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ, హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అక్కడ తీవ్ర ఆందోళన నెలకొంది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామని బెదిరింపు వచ్చింది. ప్రభుత్వానికి చెప్పాలని పాక్ స్లీపర్ సెల్స్ అంటూ మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎయిర్పోర్టులో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్