విద్యార్థులకు గుడ్ న్యూస్. పాకిస్థాన్తో ఉద్రిక్తతల కారణంగా దేశవ్యాప్తంగా వాయిదా పడిన సీఏ ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షల రీషెడ్యూల్ను ICAI ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 24 వరకు నిర్వహిస్తామని వెల్లడించింది. మధ్యాహ్నం .2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, సెంటర్లలో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేశామని ICAI పేర్కొంది.