ఇండియాలో శిశు హత్యలను నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ‘ఆడ శిశు హత్య నిరోధక చట్టం-1870’ తీసుకొచ్చింది. అయితే, ఈ చట్టం సరైన అమలుకు నోచుకోలేదు. ఇండియాలో తల్లి కడుపులో ఉన్నప్పుడు, లేదంటే పుట్టిన తరవాత దాదాపు 4.58 కోట్ల మంది బాలికలు హత్యకు గురైనట్లు ఐక్యరాజ్యసమితి జనాభా నిధి సంస్థ-2020 నివేదిక వెల్లడించింది. 2009-19 మధ్య కాలంలో భారత్లో శిశుహత్యల కారణంగా కనీసం 90లక్షల మంది బిడ్డలు తనువు చాలించారని చెప్పింది.