హైదరాబాద్ లక్డీకపూల్లో కాంగ్రెస్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో లక్డీకపూల్లో మెట్రో స్టేషన్ సమీపంలోని చౌరస్తాలో తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం బిడ్లు ఆహ్వానిస్తూ టెండర్ నోటిఫికేషన్ ప్రకటన విడుదల చేశారు. జూలై 4న రోశయ్య జయంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించాలని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు.