TG: కాళేశ్వరంపై కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్కి సంఘీభావంగా బీఆర్కే భవన్ వద్దకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, కార్యకర్తలు వేలాదిగా చేరుకున్నారు. భవన్ ఎదుట ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్కడ పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అటు కేసీఆర్ వినతి మేరకు కమిషన్ ఓపెన్ కోర్టు విచారణ కాకుండా ఇన్ కెమెరా ఎంక్వైరీ చేపట్టింది.