BRS విద్యార్థి సంఘం నేత ప్రశాంత్ను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ప్రశాంత్తో పాటు మరో 10 మంది సీఎంఆర్ కాలేజీ యజమాని ఇంటికి వెళ్లి రూ.5 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దీనిపై సీఎంఆర్ కాలేజీ యజమాని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రశాంత్తో పాటు మరో 10 మందిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇవాళ నిందితులను అరెస్టు చేసి రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చారు.