TG: విద్యార్థులు, జనరల్ బస్పాస్ల చార్జీలను తాాజాగా తెలంగాణ ఆర్టీసీ దాదాపు 20 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో పెంచిన బస్ పాస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్లోని బస్భవన్ ఎదుట ధర్నా చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో BRSV అధ్యక్షుడితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.