తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శనివారం దారుణం ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలికను గుర్తు తెలియని దుండగుడు గొంతుకోసి హత్య చేశాడు. సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. ఇంతలోనే బాలిక మృతదేహం కనిపించడం కలకలం రేపింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.