AP: విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. కొనాం ప్రసాద్(30) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి గ్రామ శివారులో పడేశారు. మృతుడు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.