మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో ఆదివారం హైవేపై పట్టపగలు దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు పట్టపగలు ఇద్దరి వ్యక్తులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.