విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వైపు వస్తోన్న వందే భారత్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. మహబూబాబాద్లోని తాళ్లపూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వందే భారత్ ఎద్దును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. కాగా వందే భారత్ రైలు ఇంజిన్ ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదం నేపథ్యంలో రైలును తాత్కాలికంగా నిలిపేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.