దేశరాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన ఆ పార్టీ.. తాజాగా కూటమిలోని కీలక నేతలను బీజేపీ తరఫున ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. ఢిల్లీలో కొన్ని లక్షల మంది తెలుగువారు ఉన్నారు. వీరిని తమ వైపు తిప్పుకునేందుకు పవన్ చేత ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది.