జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును కారు ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కారును పక్కకు జరిపి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.