టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు స్పాట్‌డెడ్

78చూసినవారు
టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. యువకుడు స్పాట్‌డెడ్
ఏపీలోని బాపట్ల జిల్లాలో మార్టూరు హైవేపై బొల్లాపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏడుగురు స్నేహితులు ట్రిప్ కు వెళ్ళి వైజాగ్ వైపు వెళుతుండగా ముందు టైరు పేలిపోయింది. దీంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆ కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు సైడు భాగం నుజ్జు నుజ్జు కాగా.. కారులో ఉన్న ఏడుగురిలో వైజాగ్‌కు చెందిన భీమన నవీన్ (32) మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్