ట్రైన్లో నిషేధిత పదార్థాలు, వస్తువులు తీసుకెళ్తే జరిమానాతో పాటు జైలు శిక్ష పడనుంది. వాటిలో గ్యాస్ సిలిండర్లు, పేలుడు పదార్థాలు బాణసంచా, కిరోసిన్ పెట్రోల్, డీజిల్, యాసిడ్, మండే/పేలే గుణం ఉన్న రసాయనాలు, ఎండుగడ్డి, 20 కిలోలకు మించి నెయ్యి తీసుకెళ్లకూడదు. నిబంధనలను ఉల్లింఘిస్తే రూ.1,000 ఫైన్, రైల్వే చట్టం 1989 సెక్షన్ 164,165 ప్రకారం మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారు.