ఢిల్లీలో రేపు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ సీఎం ఆతిశీపై కేసు నమోదైంది. కల్కాజీ అసెంబ్లీ స్థానం నుంచి ఆప్ తరపున ఆతిశీ, బీజేపీ నుంచి రమేష్ బిధురి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఆతిశీతో పాటు రమేష్ మేనల్లుడిపై కూడా కల్కాజీ నియోజకవర్గంలో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. ఎన్నికల నియామావళిని ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ మేరకు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.