మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి తనను కించపరచారంటూ సినీ నటి మాధవి లత, జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సైబరాబాద్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.