జనసేన తిరుపతి ఇంఛార్జ్ కిరణ్ రాయల్ పై కేసు నమోదైంది. లక్ష్మి అనే మహిళ ఫిర్యాదు మేరకు ఎస్వీ యూనివర్శిటీ పీఎస్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ రాయల్ తన దగ్గర రూ. కోట్లలో డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వలేదని లక్ష్మి అనే మహిళ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు.