కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కులగణన సర్వే తప్పుల తడకగా ఉందని, అది చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. సర్వేను శాస్త్రీయంగా మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఐదేళ్లలో బీసీలకు రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పిన హామీని కూడా నెరవేర్చాలని కోరారు.