CBSE 12వ తరగతి ఫలితాల్లో ఉత్తరప్రదేశ్కు చెందిన సావీ జైన్ 500లో 499 మార్కులతో దేశంలోనే టాపర్గా నిలిచింది. రోజుకు 4-5 గంటల పాటు చదివేదాన్నని, టాపిక్ అర్థం చేసుకోవడంపైనే దృష్టి పెట్టానని తెలిపింది. తన విజయం తల్లిదండ్రులు, టీచర్లకు చెందుతుందని చెప్పింది. భవిష్యత్తులో IAS అధికారి కావాలనే లక్ష్యంగా కష్టపడుతున్నానంది. సావీ జైన్ తండ్రి ఫర్నిచర్ షాప్ నడుపుతున్నారు.