TG: హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ హైవే దాటుతున్న భార్యా భర్తలను ఓ లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యా భర్తలిద్దరూ అక్కడికక్కడే మరణించారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. మృతులను తూప్రాన్పేట్ (యాదాద్రి భువనగిరి)కు చెందిన దంపతులుగా గుర్తించినట్లు సమాచారం.