భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దుల్లో సైనిక ఉద్రిక్తతలు తగ్గాయి. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని పూంఛ్ ప్రాంతంలోని నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఆర్మీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. స్థానికులంతా స్వీట్లు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే, పాక్ కాల్పుల్లో పూంఛ్లోని నివాసితుల ఇళ్లు ధ్వంసం అయిన విషయం తెలిసిందే.