భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై మాజీ సీఎం మోహబూబా ముఫ్తీ స్పందించారు. "మొదటిగా ఈ విషయంలో జోక్యం చేసుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ధన్యవాదాలు చెబుతున్నాను. అలాగే భారత్, పాకిస్థాన్ నాయకత్వాన్ని కూడా అభినందిస్తున్నాను. ఈ రెండు దేశాలు కాల్పుల విరమణపై అంగీకరించడం చాలా సానుకూల పరిణామం. ఎందుకంటే భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగితే ఫస్ట్ నష్టపోయేది జమ్మూ కశ్మీర్ ప్రజలే" అని అన్నారు.