కాల్పుల విరమణ.. పాక్‌ గగనతలం ఓపెన్‌!

74చూసినవారు
కాల్పుల విరమణ.. పాక్‌ గగనతలం ఓపెన్‌!
భారత్- పాక్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో గగనతలంలో అన్ని రకాల రాకపోకలకు అనుమతించినట్లు తాజాగా పాకిస్థాన్‌ ప్రకటించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోయిన వేళ పాకిస్థాన్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది. దేశంలోని అన్ని విమానాశ్రయాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
భారత్‌- పాకిస్థాన్‌ ఉద్రిక్తతల మధ్య కొన్ని రోజులుగా పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్