వక్ఫ్ బోర్డు ఆస్తులపై వచ్చిన ఆదాయంలో లాభాన్ని పేద ముస్లింలకు పంచుతామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. మోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను డిజిటలైజేషన్ చేస్తుందని చెప్పారు. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని తెలిపారు. దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి కబ్జాకు గురైందని, ముస్లిం సమాజం వాస్తవాలు గుర్తించాలన్నారు. జిల్లాల్లో నిర్వహించే సమావేశాలకు అన్ని వర్గాల వారిని ఆహ్వానించాలని పార్టీ నేతలను కోరారు.