పొగాకు ప్రకటనకు సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పొగాకు వినియోగాన్ని ప్రోత్సహించేలా ఉండే ప్రకటనలను ఇకపై క్రికెట్ స్టేడియంలో ప్రదర్శించకూడదని బీసీసీఐకి ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం యోచిస్తుంది. అలాగే ఇక నుంచి ప్రముఖ నటులు, క్రికెటర్లు ఈ యాడ్స్లో నటించకుండా ఆంక్షలు విధించేలా చర్యలు చేపట్టాలని సూచించనుంది.