పాకిస్తాన్ ఏం చేసినా రచ్చే. అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నిర్వహిస్తోన్న పీఎస్ఎల్పై ట్రోలింగే సాక్ష్యం. తాజాగా కరాచీ కింగ్స్ వర్సెస్ ముల్తాన్ సుల్తాన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఇద్దరు సెంచరీలు కొట్టారు. అందులో ఒకరైన జేమ్స్ విన్స్కు మోస్ట్ రిలయబుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పేరుతో హెయిర్ డ్రయర్ గిఫ్ట్గా ఇచ్చారు. తరువాత షాంపు, షేవింగ్ క్రీమ్లు ఇస్తారా? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.