చండీగఢ్ కొత్త మేయర్ మనోజ్ సోంకర్ తన పదవికి ఆదివారం రాజీనామా చేశారు. మేయర్ను బీజేపీ మోసపూరితంగా నియమించిందని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్లు ఆరోపించాయి. మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగకముందే ఆయన రాజీనామా చేశారు. ఈ పరిణామాల మధ్య చండీగఢ్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు.