తిరుపతి తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యం చెందిందని, ఈ కేసులో సీఎం చంద్రబాబును మొదటి ముద్దాయిగా కేసు నమోదు చేయాలని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా డిమాండ్ చేశారు. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి సీఎం చంద్రబాబు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ చంద్రబాబు, ఎస్పీ, టీటీడీ పాలకమండలిలోని అందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు.