తెలంగాణ ఇంటర్ బోర్డు కొత్త విధానం అమలుకు సిద్ధమవుతోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెద్ద మార్పులు ఎదురవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం సిలబస్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. అధికారికంగా సిలబస్ ను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఫైనల్ చేశారు. ఇది వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు.