పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేసింది. తాజాగా చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ జలాశయపు గేట్లను అధికారులు మూసివేశారు. దీంతో పాక్కు చీనాబ్ నదీకి సంబంధించిన నీళ్లు నిలిచిపోయాయి. మరోవైపు, చుక్క నీరు పారక నదీ పరివాహక ప్రాంతం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది.