ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన LSG జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. LSG బ్యాటర్లలో రిషభ్ పంత్ (63) అర్థశతకంతో రాణించారు. CSK బౌలర్లలో జడేజా రెండు వికెట్లు తీయగా.. అన్షుల్, ఖలీల్ తలో వికెట్ తీశారు.