హౌతీ తిరుగుబాటుదారులు కొంతకాలంగా నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. ఎర్రసముద్రంలో ఈ దాడుల్ని నిలువరించాలని ఇరాన్ను చైనా హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. ‘చైనా ప్రయోజనాలకు ఏవిధంగానైనా హాని కలిగితే.. ఆ ప్రభావం టెహ్రాన్తో ఉన్న వ్యాపార సంబంధాలపై పడుతుంది. అందుకే సంయమనం పాటించాలని హౌతీలకు చెప్పండి’ అని చైనా చెప్పినట్లు పేర్కొన్నాయి.