‘బ్రహ్మా ఆనందం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై ‘బేబీ’ సినిమా నిర్మాత ఎస్.కె.ఎన్ తాజాగా స్పందించారు. కొంతమంది కావాలని ఇలాంటి విమర్శలు చేస్తుంటారని ఆరోపించారు. ‘పెళ్లిళ్లు చేసి అత్తారింటికి సాగనంపిన చెల్లెళ్లకి సైతం తన స్వార్జిత ఆస్తులు పంచిన వ్యక్తిత్వం ఆయనది. నిజమైన ఫ్యామిలీ మ్యాన్. ఆయనపై ఊరికే అవాకులు చెవాకులు పేలడం కొందరికి అలవాటు’ అని విమర్శించారు.