మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వారసత్వం కోసం మనవడు కావాలని వ్యాఖ్యానించారు. వీటిని కేఏ పాల్ ఖండించారు. ఆడపిల్లలు వారసులు కారా? తొలి ప్రధాని నెహ్రూకు వారసురాలిగా అత్యద్భుతంగా పనిచేసిన మాజీ పీఎం ఇందిరా గాంధీ గురించి వినలేదా? అంటూ ప్రశ్నించారు. పద్మవిభూషణ్, మాజీ ఎంపీ అయిన మీరు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.