తెలంగాణలో మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చే కంపెనీలను ఎంపిక చేసేందుకు పారదర్శక విధానం పాటించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. కొత్త కంపెనీల నుంచి దరఖాస్తులను తీసుకునేందుకు నోటిఫికేషన్ జారీ చేసి, కనీసం నెల రోజుల నిర్ణీత గడువు ఇవ్వాలని చెప్పారు. ఎక్సైజ్ శాఖపై శనివారం భట్టి, మంత్రి జూపల్లితో సీఎం కలిసి సమీక్షించారు. ఇప్పటికే TGBCLకు సరఫరా చేస్తున్న కంపెనీలు కొత్త బ్రాండ్లు సరఫరా చేసేందుకు సులభతర వాణిజ్య విధానం అనుసరించాలన్నారు.