TG: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఇవాళ సాయంత్రం జరగనున్న మిస్ వరల్డ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. దీంతో పాటు మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్న డిన్నర్ కార్యక్రమాన్ని కూడా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.