TG: హజ్ యాత్రను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. యాత్రకు దరఖాస్తు చేసుకున్న 6వేల మందికీ ఆమోదం తెలిపినట్లు రేవంత్ చెప్పారు. మైనారిటీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి ముస్లీం జీవితంలో ఒక్కసారైనా మక్కా చూడాలనుకుంటారని తెలిపారు. కాసేపటి క్రితమే నాంపల్లి హజ్హౌస్ నుంచి హజ్ యాత్రికుల బస్సులు బయలుదేరాయి.