తెలంగాణ కొత్త టూరిజం పాలసీపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 31లోగా నూతన టూరిజం పాలసీ తయారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అందుకోసం దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం తెలిపారు. టైగర్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులు పెరిగేలా చూడాలని సూచించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల టెంపుల్ టూరిజం పెరిగిందన్నారు.