సీఎం రేవంత్‌ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు

70చూసినవారు
సీఎం రేవంత్‌ రెడ్డి బెంగళూరు పర్యటన రద్దు
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన బెంగళూరు పర్యటనను రద్దు చేశారు. ఆయన బెంగళూరులో జరిగే కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. భారత ప్రభుత్వం దేశంలోని చాలా ప్రాంతాలను హైఅలర్ట్‌లో ఉంచింది. కాగా, దేశ సరిహద్దుల్లో పాక్‌ బలగాలు డ్రోన్‌లతో కాల్పులకు తెగబడున్న సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్